మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్26: జిల్లా కేంద్రం మెదక్లోని అయ్యప్ప దేవాలయంలో మండల మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో మహా పడిపూజ గురుస్వాములు హరిదాస్, పవన్, ఆలయ అర్చకుడు అశోక్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టి జ్యోతిలు వెలిగించారు. పూజ కార్యక్రమంలో పా ల్గొన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుభాష్రెడ్డి, చంద్రపాల్ను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. పూజకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనినాస్, సమియొద్దీన్, అయ్యప్ప స్వాములతో పాటు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు శివరామకృష్ణ, వెంకటనారాయణ, భక్తులు లక్ష్మీపతి, చక్రపాణి, రాజన్, ప్రభు, రమేశ్, వెంకటకిషన్లతో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
ప్రారంభమైన బంగారమ్మ జాతర
మనోహరాబాద్, డిసెంబర్ 26 : శివ్వంపేట మండలం తి మ్మాపూర్లో బంగారమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమానికి జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం అధ్యక్షుడు, జడ్పీటీసీ మహేశ్గుప్తా, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి హాజరవ్వగా వారిని సర్పంచ్ అనూష అశోక్ సన్మానించారు. అదే విధం గా సోమవారం లింగమయ్యకు గావురంగం, పూజలు, మంగళవారం రేణుకమాతకు బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్లు అర్జున్, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముగిసిన పున:ప్రతిష్ఠ మహోత్సవం
పెద్దశంకరంపేట, డిసెంబర్ 26: పెద్దశంకరంపేట మండలం కొత్తపేటలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆంజనేయస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారంతో ముగిసిం ది. గణపతిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం ఎదుట ధ్వజస్తంభం ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామాయంపేట చిత్తారమ్మ దేవాలయంలో..
రామాయంపేట, డిసెంబర్ 26: రామాయంపేట పట్టణంలోని చిత్తారమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ సమావేశం నిర్వహించారు. పూజారి నేతృత్వంలో ఆలయంలో సగర సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. జనవరి 21న చిత్తారమ్మ ఆలయ వార్షికోత్సవాలను నిర్వహించాలని తీర్మానించారు. మూడు రోజుల పాటు చిత్తారమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు మర్కు దత్తు , పోచ య్య, సిద్ధ్దిరాములు, శ్రీరంగం, మర్కు నగేశ్, శ్రీనివాస్, యాదగిరి, గంగాధర్, భిక్షపతి తెలిపారు.
అయ్యప్ప పడి పూజ పట్టణానికి చెందిన నవాత్ రాజేంద్రప్రసాద్-స్వర్ణలతల కుమారుడు ఫణింద్ర స్వామి ఆధ్వర్యంలో గురుస్వామి పల్లె జితేందర్గౌడ్ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేశారు. పూజా కార్యక్రమంలో గురుస్వాములు నగేశ్, రాజు, డాక్టర్ భిక్షపతి, స్వామి, సాగర్, సాయి, శ్రీనివాస్, భరత్, శ్రీనివాస్, తదితరులున్నారు.
మంబోజిపల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో
మెదక్రూరల్ , డిసెంబర్ 26: మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పురస్కరించుకొని ఆలయంలో భక్తులతో సందడిగా మారింది.ఆలయ పూజారి మల్లన్న ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలను అలంకరించి స్వామికి పట్నాలు వేసి పూజలు చేశారు. భక్తులు ఆధిక సంఖ్యలో చేరుకుని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు .
నస్కల్లో…
నిజాంపేట,డిసెంబర్ 26: మండలంలోని నస్కల్లో అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ప్రతిమకు స్వాములు అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు. ఇరుముడి కార్యక్ర మం అనంతరం స్వాములు శబరిమలకు బయలు దేరా రు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, సంతోశ్, సందీప్ గ్రామస్తులు ఉన్నారు.