మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి..
పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్న వినోద్ కుమార్
రామాయంపేట, డిసెంబర్ 26 : పర్యావరణ పరిరక్షణ కోసమే తాను సైకిల్యాత్రను చేపడుతు న్నానని వినోద్కుమార్ తెలిపారు. ఆదివారం తన సైకిల్ యాత్ర మహబూబాబాద్ నుంచి రామాయంపేట జాతీయ రహదారికి చేరుకున్నది. సైకిల్యాత్ర చేరుకున్న విషయం తెలుసుకున్న సానీక్ష ఫౌండేషన్ నిర్వాహకులు శివ, విజన్ సంస్థ డైరెక్టర్ వంగరి కైలాస్ సైకిల్యాత్ర చేస్తున్న వినోద్ కుమార్ను పట్టణానికి ఆహ్వానించి పండ్లు, ఇతర సామగ్రిని అందజేశారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ తాను పర్యావరణ పరిరక్షణతో పాటు బాలికల సంరక్షణ కోసం తన స్వగ్రామం మహబూబాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటానని తెలిపారు.