బాలునాయక్ కుటుంబానికి అండగా ఉంటా
మనోధైర్యంతో కరోనాను జయించవచ్చు
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
చండ్రుగొండ, జూన్ 26: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వితరణ ద్వారా వచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్ గీతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో మాజీ ఎంపీపీ బాలునాయక్ కుమారులు ప్రవీణ్ప్రకాశ్, హరిప్రకాశ్ను పరామర్శించారు. బాలునాయక్ మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. మనోధైర్యంతో కరోనాను జయించవచ్చని అన్నారు. ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ భోజ్యానాయక్, ప్రధాన కార్యదర్శి చీదెళ్ల పవన్కుమార్, నియోజకవర్గ బాధ్యులు జారె ఆదినారాయణ, మేడా మోహన్రావు, గానుగపాడు సొసైటీ అధ్యక్షుడు చెవుల చందర్రావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, గుంపెన సొసైటీ అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, వైస్ ప్రెసిడెంట్ నల్లమోతు వెంకటనారాయణ, గాదె లింగయ్య, భూపతి రమేశ్, భూపతి శ్రీనివాసరావు, గుగులోత్ రాములు, సంకా కృపాకర్, గుగులోత్ ఈర్యానయక్, గుగులోత్ రమేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, తహసీల్దార్ ఉషాశారద, ఎంపీడీఓ అన్నపూర్ణ, సీడీపీఓ నిర్మలాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.