నాగర్కర్నూల్లో 25 ఏండ్ల కిందట స్థాపించిన మదర్సా ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూమ్
అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో బోధన
నేడు మదర్సాలో 25 వసంతాల వేడుకలు
నాగర్కర్నూల్, డిసెంబర్ 25 : నాగర్కర్నూల్ నడిబొడ్డున 1995లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ అరబిక్ యూనివర్సిటీ జామియా నిజామియా ఆధ్వర్యంలో మదర్సా ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూమ్ స్థా పించారు. ఏడుగురిని ఫౌండర్ సభ్యులుగా నియమించా రు. దాతల సాయంతో సొంత స్థలంలో విశాలంగా మ దర్సా భవనాన్ని, మరో ఇద్దరు దాతల సాయంతో మద ర్సా ఆవరణలో మజీద్ను నిర్మించారు. మదర్సాల నిర్వహణ కష్టసాధ్యమైన తరుణంలో వ్యయప్రయాసాలకో ర్చి అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ తదితర మాధ్యమాల్లో విద్యా బోధన అందించారు. జామియా నిజామియా యూనివర్సిటీలోనే ఆదర్శ మదర్సాగా నిలిచింది. స్థానికులు, దాతల సహకారంతో మదర్సా నిర్వహణ కొనసాగుతున్నది. 1995లో మదర్సాను స్థాపించగా.. 1996లో జామియా నిజామియా గుర్తింపు లభించింది. 1995 నుంచి 2021 వరకు 72 మంది విద్యార్థులు ఖురాన్ను కంఠస్థం చేశారు. వీరందరికీ జామియా నిజామియా ద్వారా డిగ్రీ పట్టాలు అందించారు. మదర్సా ఏర్పాటు లో ఫౌండర్ కమిటీ సభ్యులైన సయ్యద్ ఉబేదుల్లా హు స్సేనీ, అబ్ధుల్ హన్నాన్, సయ్యద్ రఫీయొద్దీన్, హబీబ్ఖాన్, అబ్ధుల్ బాసిత్, మహ్మద్ అలీ, సయ్యద్ షాహాబొద్దీన్ సభ్యులుగా మదర్సా అభివృద్ధికి బాటలు వేశా రు. యువకులు, ప్రముఖులు, మజీద్, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీల సహకారంతో మదర్సా ముందుకు సాగుతున్నది. ఈ ఏడాదికి మదర్సా స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకలకు హైదరాబాద్ జామియా నిజామియా అరబిక్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, సయ్యద్ సఘీర్ అహ్మద్, హఫీజ్ రజియోద్దీన్, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతేకాకుండా 25 ఏం డ్లలో చదివిన విద్యార్థులు కూడా రానున్నారు. ఖురాన్ కంఠస్థం చేసిన విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు, ప్రముఖులను సన్మానించనున్నారు.