సూర్యాపేట అర్బన్ అక్టో బర్ 23 : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. 9,177 మంది విద్యార్థులకు 8,275 మంది హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలతో పరీక్షలు నిర్వహించగా విద్యాశాఖ అధికారులు కేంద్రాలను పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్ష లు తొలిరోజు సోమవా రం ప్రశాంతంగా జరి గాయి. మొత్తం 9,177 మంది విద్యార్థులకు గాను 8,275విద్యార్థులు హాజరవగా 902మంది గైర్హాజరయ్యారు. జనరల్ గ్రూపులో 7,739విద్యార్థులకు గాను 7,122 మంది, ఒకేషన ల్లో 1438మంది విద్యార్థులకు 1153మంది హాజరయ్యా రు. గైర్హాజరైన మొత్తం 902 విద్యా ర్థుల్లో 617మంది జనరల్, 285మంది ఒకేష నల్ విద్యార్థులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ కేసులేమీ లేవని అధికారులు తెలిపారు. జిల్లాకేంద్రంలోని 18పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను కరోనా నిబంధనల మేరకు నిర్వహిస్తున్నామ న్నారు. ప్రతీ విద్యార్థి మాస్క్, శాని టైజర్ ఉపయోగించేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోని సీఎస్లు, డెవలప్మె ంట్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచన లిస్తూ పరీక్షలను పర్యవేక్షిస్తున్నామన్నారు.