అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు
పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దు
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్(నకిరేకల్), జనవరి 25 : నకిరేకల్ పట్టణ ప్రజల సౌకర్యం కోసమే సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏనాడు ప్రజల బాగోగులను పట్టించుకొని కొందరు నాయకులు మార్కెట్ ఏర్పాటుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది పగటి వేషగాళ్లు పనిపాట లేక అనవసర రాద్ధ్దాంతం చేస్తున్నారని వారి మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కోట్లాది రూపాయలతో పట్టణంలో అభివృద్ధి పనుల చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలను గ్రహించకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలకు సూచించారు. కొంతమంది మీడియా పేరు చెప్పుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని, స్వలాభాల కోసం మీడియా ప్రతిష్టను దిగజర్చవద్దన్నారు. కొన్ని మీడియా సంస్థలు, యూ ట్యూబ్ ఛానళ్లు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు మార్కెట్ యార్డుపై తప్పుడు ప్రచరాలు చేస్తున్నారని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్ని కుళ్లుకుతాంత్రాలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు.
అభివృద్ధిలో రాజీ పడేదిలేదు
కట్టంగూర్(నకిరేకల్): నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేదిలేదని, రాబోయే ఏడాదిన్నర కాలంలో పట్టణంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని 3,12వ వార్డుల్లో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, కౌన్సిలర్లు పొడుగు స్వాతి, కొండ శ్రీను, భిక్షంరెడ్డి, స్వామి, రాచకొండ సునీల్, పల్లె విజయ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, త్రిమూర్తులు పాల్గొన్నారు.
కట్టంగూర్లో..
కట్టంగూర్ మండలం పామనుగుండ్ల, కల్మెర, నారెగూడెం, నల్లకుంటబోళ్లు గ్రామాల్లో రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, తాసీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచులు వడ్డె సైద్దిరెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, కురిమిల్ల పూలమ్మ, శ్రీను, గుర్రం సైదులు, ఎంపీటీసీలు పాలడుగు హరిబాబు, జానీపాషా, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, నాయకులు బీరెల్లి ప్రసాద్, పుట్టా వెంకట్రెడ్డి, గుండగోని రాములు, ఉప సర్పంచులు చెరుకు నర్సింహ, నర్సిరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.