ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
48 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చిట్యాల, జూన్ 24 ; కరోనా సంక్షోభంలోనూ అత్యంత సమర్థంగా సంక్షేమ పథకాల్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రశివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.48,05,568 లక్షల విలువగల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 48 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారిందని చెప్పారు. పేదలకు ఇబ్బంది కలుగొద్దనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు, రేషన్ బియ్యం, కేసీఆర్ కిట్లు కొనసాగిస్తూనే.. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయం, పాడి పంటలతో రాష్ట్రం ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా నుంచి విముక్తి పొందడానికి జాగ్రత్తలు తీసుకుంటూ హరితహారం కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, ఎంపీటీసీల ఫో రం అధ్యక్షుడు జంబుల తిరుపతి, సర్పంచ్ పూర్ణచందర్రావు, కో ఆప్షన్ సభ్యులు రాజమహ్మద్, ఎంపీటీసీ కట్కూ రి పద్మానరేందర్, టీఆర్ఎస్ టౌన్ ప్రసిడెంట్ పాండ్రాల స్వామి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.