కొవిడ్ సమయంలో భరోసానిచ్చిన సింగరేణి యాజమాన్యం
ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు
కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం
ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమం, ఆరోగ్యంపైనా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. కరోనా ఆపత్కాలంలో సంస్థ ఆర్థికంగా నష్టపోయినప్పటికీ, కార్మిక కుటుంబాలకు అండగా నిలిచింది. సంస్థ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించింది. ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ బారిన పడిన వారి కోసం క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడ కోలుకొని వా రికి కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్య సహాయాన్ని అందించిం ది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కొవిడ్తో మృ తి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.15 లక్షలు ఎక్స్గ్రేషియాను అందజేయడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే ప్రక్రియను షురూ చేసింది.
రూ.71 కోట్లతో కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు
కొవిడ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సింగరేణి సంస్థ కోట్లాది రూపాయలు వెచ్చించి నివారణ చర్యలు, వైద్య సేవలు అంది స్తూ వస్తున్నది. 1,27,000కు పైగా రాపిడ్ యాంటిజెన్ / ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు, 27 వేల మందికి (ఉద్యోగులు, రిటైర్డ్ ఉ ద్యోగులు వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు పనివారు) వ్యా క్సినేషన్, 1400 బెడ్లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటు, హైదరాబాద్లో అత్యవసర వైద్య సేవలు, అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు, ముందస్తు జాగ్రత్తగా ఐదు చోట్ల ఆక్సీజ న్ ప్లాంట్ల ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టింది. సంస్థ ఇప్పటి వరకు 1,25,250 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కిట్లను రూ.3.16 కోట్లతో కొనుగోలు చేసింది.
రూ.43 కోట్లతో ప్రత్యేక వార్డులు
సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 692 బెడ్లకు అదనంగా మరో 736 బెడ్లను సమకూర్చి ప్రత్యేక వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో యాజమాన్యం వైద్య సేవలు అందిస్తోంది. ప్రత్యేక వార్డులు ఏర్పాటు కోసం ఇప్పటి వరకు కంపెనీ సుమారు రూ. 43 కోట్లు ఖర్చు చేసింది. సింగరేణి క్వారంటైన్ సెంటర్లలో వైద్య సేవలు పొందే వారి కోసం వివిధ రకాల మందులు, పల్స్ ఆక్సీమీటర్ లాంటి 18 రకాల వస్తువులు ఉన్న కిట్లను అందజేసింది. సుమారు రూ.80 లక్షల వ్యయంతో ఈ కిట్లను కొనుగో లు చేసి క్వారంటైన్ సెంటర్లు, హోం ఐసొలేషన్లో ఉన్న రోగులకు అందజేసింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న దవాఖానలకు అవసరమైన రెమిడెసివిర్ టీకాలు, ఫెవిపెరావిర్ మాత్రలు లాంటి మందులను రూ.5.55 కోట్లతో సమకూర్చారు.
అందుబాటులోకి ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు
సింగరేణిలో ఇప్పటికే ఉన్న ఆక్సిజన్ సిలిండర్లకు అదనంగా మ రో 370 సిలిండర్లను రూ.1.28 కోట్లతో కొనుగోలు చేసి ఏరి యా దవాఖానలకు పంపించారు. తద్వారా ఆక్సిజన్ కొరత లే కుండా చూశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా సుమారు రూ.3.60 కోట్ల వ్యయంతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రూ.2 కోట్లతో అదనపు వైద్య సిబ్బంది
సుమారు రూ.2 కోట్లు వెచ్చించి కొవిడ్ వార్డులకు అవసరమైన మరో 35 మంది అదనపు డాక్టర్లు, 126 మంది నర్సులు, 260 మంది సిబ్బందిని కూడా కాంట్రాక్టు పద్ధతిన నియమించి వైద్య సేవలు అందిస్తున్నారు. కొవిడ్ వైద్య సేవల్లో పాల్గొంటున్న కం పెనీ వైద్యులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రత్యేక ఇన్సెంటీవ్ కూడా చెల్లిస్తున్నది. కొవిడ్ రోగులకు పౌష్టికాహారం అందించింది. వీటితో పాటు శానిటేషన్ లిక్విడ్, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, వైద్యులకు కావాల్సిన పీపీఈ కిట్లు, మాస్కులు కొనుగోలు చేసి అందజేసింది. రూ.3.15 కో ట్ల వ్యయంతో 300 రకాల అత్యవసర వైద్య సేవల పరికరాలను సమకూర్చింది.
సింగరేణి యాజమాన్యం సుమారు రూ.71 కోట్లను వెచ్చించి, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శంగా కొవిడ్ నివారణ చర్యలను చేపట్టింది. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాం ట్రాక్టు కార్మికులకు కూడా వైద్య సేవలను అందించింది. సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవతో డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో నిత్యం పర్యవేక్షించారు. నివారణ చర్యలు, వైద్య సేవలు సింగరేణి స్థా యిలో పటిష్టంగా అమలు చేశారు.