ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన సేవలు
ఐసొలేషన్లో 91 మంది చికిత్స..
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అందుబాటులో 180 పడకలు
పేషెంట్లకు పోషకాహారం అందిస్తున్నాం..
విప్ సుమన్, ఎమ్మెల్యేలు చిన్నయ్య, దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి
బెల్లంపల్లి ఐసొలేషన్లో పేషెంట్లతో మాట్లాడిన సుమన్
బెల్లంపల్లి(హాజీపూర్), మే 20 : కరోనా వైరస్ నియంత్రణకు సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని, పేషెంట్లు మనోధైర్యంతో ఎదుర్కోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు చిన్నయ్య, దివాకర్రావు పేర్కొన్నారు. కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి బెల్లంపల్లి ఐసొలేషన్ను సందర్శించగా.. విప్ సుమన్ కొవిడ్ బాధితులతో మాట్లాడారు. చికిత్స విధానం గురించి తెలుసుకొని.. సర్కారు మెరుగైన చికిత్స అందిస్తున్నది, భయపడాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు. అనంతరం సమీక్షలో విప్ సుమన్ మాట్లాడారు. బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రంలో 91 మందికి వైద్యసేవలు అందుతున్నాయని, 18 మంది వెంటిలేటర్ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. మందమర్రి మండలంలోని క్యాతనపల్లిలో గల ఆక్సిజన్ ప్లాంట్ను కూడా తనిఖీ చేశారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ మనోధైర్యంతో ఉండాలని, వైరస్ నియంత్రణ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అనేక రక్షణ చర్యలు తీసుకుంటుందని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, బెల్లంపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్తో కలిసి బెల్లంపల్లిలో ఉన్న ఐసొలేషన్ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడారు. ఐసొలేషన్ కేంద్రంలో 91 మందికి వైద్య సేవలు అందుతున్నాయని, 18 మంది వెంటిలేటర్ సౌకర్యం పొందుతున్నారన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 100 పడకలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించి హోం ఐసొలేషన్ సౌకర్యం లేని వారికి ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దవాఖాన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో కొవిడ్ బాధితులకు పూర్తి స్థాయి వైద్య సౌకర్యం అందుతుందని, పరీక్షలు చేసి మెడికల్ కిట్లు అందిస్తున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి తెలిపారు.ప్రతి రోగి కోలుకునే విధంగా వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసొలేషన్ కేంద్రంలో ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు.రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానకు 40 పడకలు అందించినట్లు తెలిపారు. నేషనల్ అథారిటీ సౌజన్యంతో మంచిర్యాల ఐసొలేషన్ కేంద్రానికి 40 పడకలు సమకూర్చినట్లు వివరించారు. రోగులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన వారు ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చునని తెలిపారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
రామకృష్ణాపూర్, మే 20 : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని నిరుపేద కుటుంబాలకు వెయ్యి రూపాయల విలువైన 13 రకాల నిత్యావసర సరుకులను చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పంపిణీ చేశారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలోని సుమారు 400 వందల మందికి 13 రకాలైన నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అంతకుముందు బొక్కలగుట్ట పంచాయతీలోని కోటేశ్వర్రావు పల్లెలో వాయుసేన పేరుతో ఆరుగురు నిరుద్యోగ యువకులు ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ను కలెక్టర్ భారతీ హోలికేరీతో కలిసి సందర్శించారు. ఆక్సిజన్ సరఫరా చేస్తూ కరోనా రోగుల ప్రాణాలు కాపాడుతున్న ప్లాంట్ నిర్వాహకులను విప్ అభినందించారు. రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానలో వైద్య సౌకర్యం పొందే హక్కు ఇక్కడి ప్రజలకు ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ సమన్వయ కర్త అబ్దుల్అజీజ్, నాయకులు ఎండీ యాకూబ్అలీ, సుదర్శన్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.