ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్ మండలంలో ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు
కడ్తాల్, జనవరి 18 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్ రూ.50 వేలతో సమకూర్చిన వీధిలైట్లను గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్సీ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాలు, పల్లెలు, తండాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు పథకంతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. కడ్తాల్ మండలం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని అన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అన్మాస్పల్లి గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటుకు సొంత నిధులు కేటాయించిన వైస్ ఎంపీపీ ఆనంద్ను ఎమ్మెల్సీ, గ్రామస్తులు అభినందించారు. అంతకుముందు గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీని నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ అనిల్యాదవ్, నాయకులు హన్మానాయక్, భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, వెంకట్రెడ్డి, యాదయ్య, మోత్యానాయక్, గణేశ్, కృష్ణ, శ్రీశైలం, భిక్షపతి, బిక్కునాయక్, శేఖర్, మహేశ్ పాల్గొన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ కేక్ని కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మైసమ్మతల్లి ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు…
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మైసిగండి మైసమ్మతల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్సీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంక్డావత్ హన్మానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, కేఎన్ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్, నాయకులు వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మోహన్నాయక్, శ్రీనునాయక్, రవినాయక్, భాస్కర్నాయక్, వేణుగోపాల్, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, వంశీధర్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, జహంగీర్అలీ, భిక్షపతి, మోత్యానాయక్, కృష్ణ, అనిల్యదవ్, శేఖర్గౌడ్, భూనాథ్నాయక్, బిక్కునాయక్, భీష్మాచారి, మహేశ్, సుమన్, మల్లేశ్గౌడ్, ప్రభులింగం, కుమార్, గణేశ్, జైపాల్, చందోజీ, యాదయ్య, గోపి, బాబులాల్, శ్రీశైలం ఉన్నారు.