ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెదక్, హైదరాబాద్ జట్లు
భువనగిరి అర్బన్, నవంబర్ 14: భువనగిరి పట్టణంలో ఆదివారం హోరాహోరీగా జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో మహబూబ్నగర్నే విజయం వరించింది. ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 2 పాయింట్లు పొందగా, మెదక్ జట్టు(0) పాయింట్లు సాధించింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెదక్, హైదరాబాద్ జట్లు నిలిచాయి. విజేతలకు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్మే పైళ్ల శేఖర్రెడ్డి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సందీప్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం : ఎమ్మెల్యే పైళ్ల
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. క్రీడాకారులు ఎంచుకున్న క్రీడపై ఆసక్తి పెంచుకుని, పట్టుదల, ఏకాగ్రతతో కృషిచేస్తే విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు భువనగిరిని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు.
పట్టుదలే ముఖ్యం : భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేశ్కుమార్
క్రీడల్లో రాణించేందుకు పట్టుదల, సమయం కేటాయించడమే ముఖ్యమని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేశ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హాకీ క్రీడను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తనకు గౌరవం దక్కిందన్నారు. క్రీడలపై యువతకు ఆసక్తి కలిగేలా కోచ్లు అవగాహన కల్పించాలన్నారు. క్రీడలు మానసిక, శారీరక సామర్థ్యం పెంపునకు దోహదపడుతాయని పేర్కొన్నారు. పోటీలకు సహకరించిన వారికి, విజేతలకు హాకీ జిల్లా అధ్యక్షుడు బి.కిరణ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రథమ క్రీడాకారుడిగా మహబూబ్నగర్ జట్టు కెప్టెన్ ఎన్.సంతోష్కు రూ.1001బహుమతి, మెమెంటో, ఉత్తమ ద్వితీయ క్రీడాకారుడిగా మెదక్ జట్టు కెప్టెన్ టి.రాజుకు మెమెంటో, అప్కమింగ్ క్రీడాకారుడిగా, నల్లగొండ జట్టు క్రీడాకారుడు పి.వినయ్కి మెమెంటో అందజేశారు. అనంతరం పోటీల్లో గెలిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ జట్లకు కప్, మెమెంటోలు, ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీబీనగర్ ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్, కౌన్సిలర్ కిరణ్కుమార్, పంగరెక్క స్వామి, జిల్లా యువజన క్రీడల అధికారి ధనంజనేయులు, హాకీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ లచ్చు, రాష్ట్ర కోశాధికారి భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షుడు కాశీ, వివిధ జిల్లాల కార్యదర్శులు ఉస్మాన్, కుమారి, రమణ, కరీం, స్థానిక పీఈటీలు, ఉమ్మడి 10జిల్లాల జట్ల కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.