మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ
నారాయణపేట రూరల్, నవంబర్14: విద్యార్థులు చదువుతోపాటు సంస్కృతి, కళలు, నృత్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చాలని పేట మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయాచంద్రకాంత్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన బృంద నృత్య పోటీల విజేతలకు ఆదివారం నారాయణపేట జిల్లా బాలకేంద్రంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారాయణపేట జిల్లా సంస్కృతి, కళలకు పుట్టినిల్లని, విద్యార్థులు ప్రతిరోజు బాల కేంద్రంలో కళలు నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు కళల్లో మంచి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిలో పేటకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మొదటగా నెహ్రూ, సరస్వతీదేవి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం బృంద నృత్య పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి రాధిక బృందం (వైదిక పాఠశాల) ద్వితీయ బహుమతి కళ్యాణి బృందం (శ్రీహంసవాహిని పాఠశాల) తృతీయ బహుమతి పుష్ప బృందం (మార్కెట్లైన్ పాఠశాల) గెలుపొందాయి. జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి కవిత బృందం ( శ్రీహంసవాహిని పాఠశాల)ద్వితీయ బహుమతి శ్వేత బృందం (గురుకుల పాఠశాల కోటకొండ) తృతీయ బహుమతి లావణ్య బృందం (జెడ్పీహెచ్ఎస్) ప్రోత్సాహక బహుమతి కావేరి బృందం(మార్కెట్లైన్ పాఠశాల) గెలుపొందాయి. కార్యక్రమంలో కౌన్సిలర్లు శిరీషాచెన్నారెడ్డి, జొన్నల అనితాసుభాష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, బాలకేంద్రం సిబ్బంది మహిపాల్రెడ్డి, సంగ నర్సిములు తదితర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చాక్లెట్లు పంపిణీ చేసిన కౌన్సిలర్
నారాయణపేట టౌన్, నవంబర్ 14: బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని చిల్డ్రన్ పార్క్లో టీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుభాష్, కౌన్సిలర్ అనిత చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి చిన్నారులకు చిల్డ్రన్స్డే శుభాకాంక్షలు తెలియజేశారు.