గత 70 ఏండ్ల పాలనలో ఎవరూ పట్టించుకోలే
ప్రసాద్ పథకం కింద కేంద్రం నిధులు ఇవ్వాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కొండగట్టు, వేములవాడలో పూజలు
వేములవాడ టౌన్/మల్యాల, సెప్టెంబర్ 13: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే సాంస్కృతిక, పురాతణ, చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధి జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సోమవారం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు అంజన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయాచోట్ల మాట్లాడారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కృష్ణా, గోదావరి నదులపై అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టులు నిర్మించారని, కేసీఆర్ తీసుకున్న చర్యలతో తెలంగాణ ఇవ్వాళ మిగులు విద్యుత్ ఉత్పత్తి సాధించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 70 ఏండ్లలో ఆలయాలు, సాంస్కృతిక, చారిత్రాత్మక కట్టడాల అభివృద్ధిని సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం వచ్చాకనే యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించుకున్నామని, వేములవాడ రాజన్న క్షేత్రం, కొండగట్టు అంజన్న ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ కింద ఆలయాలు అభివృద్ధి చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఇపుడు మరోసారి ప్రణాళికా సంఘం తరపున కృషిచేస్తానని చెప్పారు.
కాగా, కొండగట్టు ఆలయ ప్రాకార మండపంలో వినోద్కుమార్కు ఈవో వెంకటేశ్ స్వామి తీర్థప్రసాదాలను అందజేసి సన్మానించారు. కొండగట్టు అంజన్నను వినోద్కుమార్తోపాటు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ ముత్యంపేట-కొండగట్టు సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల, కొడిమ్యాల జడ్పీటీసీలు కొండపలుకుల రాంమోహన్రావు, పునుగోటి ప్రశాంతి, మల్యాల, కొడిమ్యాల ఎంపీపీలు మిట్టపల్లి విమల, మేన్నేని స్వర్ణలత, మల్యాల, కొడిమ్యాల మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుదర్శన్, కృష్ణారావు, సహకార సంఘాల అధ్యక్షులు సాగర్రావు, రాంలింగారెడ్డి, మధుసూదన్రావు, రాజనర్సింగరావు, మల్యాల, రామడుగు మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, వెంకటరెడ్డి, చొప్పదండి మున్సిపల్ చైర్మన్ నీరజ, ఆర్డీవో మాదురి, డీఎస్పీ ప్రకాశ్, మల్యాల సీఐ రమణమూర్తి, ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, మారుతీ, నాయకులు సంపత్గౌడ్, నాగరాజు, రాజేందర్, జున్ను సురేందర్, లింగం గౌడ్, కోటేశ్వర్రావు, సుకురొద్దీన్, అజహర్ పాల్గొన్నారు.
రాజన్న సన్నిధిలో..
వేములవాడ రాజన్నను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయంలో వారికి స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ శాలువాతో సత్కరించగా, వినోద్కుమార్కు ఎమ్మెల్యే రమేశ్బాబు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఇక్కడ రాజన్నసిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.