గోదావరిఖని, జూన్ 13: సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ మేరకు ఆర్జీ-1 పరిధిలోని గోదావరిఖనిలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై సెక్టార్-1లో ప్రారంభించి మాట్లాడారు. సీఎండీ ఆదేశాల మేరకు 18 నుంచి 60 ఏండ్ల వయసు ఉన్న ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తున్నామని వివరించారు. కరోనా నుంచి కార్మికులను కాపాడేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులను అభినందించారు. ఆర్జీ-1 ఏరియాలో కమ్యూనిటీ హాల్, విఠల్నగర్ డిస్పెన్సరీ, సీఈఆర్ క్లబ్, టీటీసీల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విఠల్నగర్ డిస్పెన్సరీని డైరెక్టర్ సందర్శించి వ్యాక్సిన్ తీసుకుంటున్న ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం ఆర్జీ-1 జీఎం కే నారాయణ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్లో 3 రోజుల పాటు వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం త్యాగరాజు, ఏజెంట్లు చిలక శ్రీనివాస్, శ్రీనాథ్, డీజీఎం నవీన్, మదన్ మోహన్, ఏసీఎంవో వెంకటేశ్వరరావు, డీవైపీఎం సలీం, హెల్త్ ఆఫీసర్ పద్మ, డాక్టర్ మద్దిలేటి, ఎస్వో వీరారెడ్డి, పీవో సారంగపాణి, శ్రావణ్, చక్రవర్తి ఉన్నారు.
మెగా వ్యాక్సినేషన్ క్యాంపును డైరెక్టర్ బలరాం సందర్శించారు. కార్మికులకు కల్పించిన వసతులను పరిశీలించి అభినందించారు. ఆర్జీ-1 ఏరియాలో ఆదివారం మొత్తం 719 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపారు.
యైటింక్లయిన్ కాలనీ, జూన్ 13 : ఆర్జీ-2లోని సెక్టార్-3 డిస్పెన్సరీ, సింగరేణి హైస్కూల్, సీఈఆర్ క్లబ్, సేవా భవన్, యోగా సెంటర్లో వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉద్యోగులకు టీకాలను వేయగా, సంస్థ డైరెక్టర్ పర్యవేక్షించారు. ఆయన వెంట ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం సాంబయ్య, అధికారులు పైడీశ్వర్, రాధాకృష్ణారావు, మురళీకృష్ణ, ప్రదీప్కుమార్, ఎర్రన్న, చంద్రమౌళి, రాజారెడ్డి, హరినాథ్, పీవీ రమణ, సుబ్రహ్మణ్యం, వంశీధర్, వేణుగోపాల్, యూనియన్ నాయకులు శంకర్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.