సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన మహానుభావుడు
ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఏప్రిల్ 13 : సమసమాజ నిర్మాణం కోసం ప్రతి క్షణం పరితపించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ పయనించాల్సిన అ వసరం ఉందని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవా రం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో నూతనంగా ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నే డు పాలకొండ రూపురేఖలే మారిపోయాయన్నారు. పాలకొండలో జీవనం సాగించేందుకు ఎంతో మంది ఆతృత కనబర్చుతున్నారని తెలిపారు. బైపాస్ రోడ్డు పాలకొండ మీదుగా వెళ్లడం ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నా రు. మహబూబ్నగర్ను మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాలకొండకు రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ రానున్నదని తెలిపారు.
ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
అందరూ ఐక్యంగా ఉంటూ ముం దుకు సాగినప్పుడే అభివృద్ధి మరింత వే గంగా జరుగుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ చౌరస్తా దగ్గర హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భ వనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్లక్ష్యానికి తావివ్వకుండా మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
ఆయురారోగ్యాలతో జీవించాలి
నూతన తెలుగు సంవత్సరంలో ప్ర జలు ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పద్మావతి కాలనీలో ప్రభోద సేవా సమితి జ్ఞాన వేదిక మహబూబ్నగర్ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని త్రైత సిద్ధాంతం తెలుగు సంవత్సర నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో కరోనా మహమ్మారికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. గొప్ప లక్ష్యాలతో అడుగులు ఆరంభించాలని, వాటిని అందుకునేందుకు శ్రమిస్తూ ముం దుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సులువవుతుందన్నారు. కార్యక్రమాల్లో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అ ధ్యక్షురాలు స్వప్నరాణి, టీఆర్ఎస్ నేత సురేందర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్, జంబులయ్య, నాయకులు, ప్రబోధ సేవా స మితి సభ్యులు పాల్గొన్నారు.
మార్షల్ ఆర్ట్స్లో రాణించాలి
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 13 : మార్షల్ ఆర్ట్స్లో ప్రతి ఒక్కరూ రాణించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇటీవలే జరిగిన జాతీయస్థాయి కరాటే టోర్నీ జిల్లా కేంద్రంలోని ఆర్కే స్పోర్ట్స్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థి జయదీప్సింగ్ గ్రాండ్ చాంపియన్షిప్ సాధించగా.. మంగళవారం విద్యార్థిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ప్ర భుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రస్తుత సమాజంలో కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. కార్యక్రమంలో అకాడమీ ఫౌండర్ రవికుమార్, టీఆర్ఎస్ నేత ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.