బేగంపేట్ : దేశంలోనే గుండె, ఊపిరి తిత్తుల మార్పిడికి పేరుగాంచిన కిమ్స్ ఆసుపత్రిలో రెస్పిరేటరీ కేర్ ఫిజిషియన్లు ఉత్తర భారత దేశానికి చెందిన 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. ఆ బాలుడు తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగ ఆరోగ్యం తీవ్రంగ దెబ్బతినడంతో ఎక్మో థెరపి కోసం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చారు.
కిమ్స్లో ఈ బాలుడిని వీనో వీనస్ ఎక్మోపై 65 రోజుల పాటు ఉంచి లైఫ్ సపోర్ట్ను అందించారు. ఇందులో భాగంగా అన్ని అవయవాలు ఎలా పని చేస్తున్నాయో నిశితంగ పరిశీలించి అదనపు పోషకాహారం అందించి శారీరక వ్యాయామం ద్వారా అవయవాలు పరితీరు మెరుగు పరిచి ఎక్మోపై ఉంచి ఆత్యాధునికంగా ఊపిరి తిత్తుల పనితీరును మెరుగు పరిచారు.
కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉండి న్యూమోనియా వచ్చిన పిల్లలకు ఎక్మో బ్రిడ్జిపై ఇంత ఎక్కువ కాలం చికిత్స చేయడం ఇదే మొదటి సారి. ఈ తరహా చికిత్స పొంది ప్రాణాలు దక్కిన ఇంత చిన్న వయసు కేసు ఇప్పటి వరకు దేశంలోనే ఇది మొదటిది.
శుక్రవారం సికింద్రాబాద్ కిమ్స్ దవఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్కు చెందిన ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ… ఈ బాలుడిని మా వద్దకు తీసుకు వచ్చినప్పు డు అతని ఊపిరి తిత్తులు బాగా పాడయ్యాయి. దీంతో బాలుడి శరీరానికి ఆక్సీజన్ అందడం లేదు.
ఎక్మో సపోర్ట్ వల్ల అతడి ఊపిరి తిత్తులకు విశ్రాంతి లభించింది. దీంతో వాటంతట అవే బాగుపడి పూర్తిస్థాయి సామార్థ్యాన్ని సంతరించుకొని మళ్లీ పని చేయడం ప్రారంభించాయి.
అనంతరం సీనియర్ పల్మనాలజిస్ట్, ప్రైమరీ ఫిజిషియన్ డాక్టర్ బి, పి సింగ్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఉన్న మిడ్లాండ్ హెల్త్కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి కొవిడ్ న్యూమోనియా ఉన్న బాలుడిని కిమ్స్ బృందం హైదరాబాద్కు తీసుకువచ్చింది.
మిడ్లాండ్ హెల్త్కేర్ , కిమ్స్ వైద్య బృందాలు సంయుక్తంగా చేసిన కృషి విజయవంతం అవ్వడం అద్భుతమే అన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్ సుప్రబాత్, డాక్టర్ సందీప్ అత్తావర్ తదితరులు పాల్గొన్నారు.