రైతులను ఆదుకోవాలని అమాత్యుడు కేటీఆర్ ఆదేశాలు
రంగంలోకి అధికారులు.. యుద్ధప్రాతిపదికన పంట నష్టం అంచనా
రెండు రోజులుగా వివరాల సేకరణ
మరో వారంపాటు సర్వే
త్వరలోనే సర్కారుకు నివేదిక
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో కుదేలైన రైతును ఆదుకునేందుకు సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం పంట చేలకు పరుగులు పెట్టింది. వర్షానికి దెబ్బతిన్న పంటలను వెంటనే సర్వే చేయాలన్న అమాత్యుడు కేటీఆర్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన కదిలింది. జిల్లావ్యాప్తంగా సర్వే చేసి ఇప్పటివరకు 4,822మంది రైతులకు చెందిన 6,710 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాకు వచ్చింది. రెండు రోజులు చేసిన సర్వేలో వరి 4,280 ఎకరాల్లో, పత్తి 243 ఎకరాల్లో నీట మునిగిందని చెప్పింది. మరో వారంలో పూర్తి వివరాలు సేకరించి సర్కారుకు నివేదిక పంపేందుకు కసరత్తు చేస్తున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆస్తినష్టంతో పాటు పంట నష్టం చేసింది. భారీ వర్షాలతో కుదే లైన రైతును ఆదుకునేందుకు సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం పంట చేలకు పరుగు లు పెట్టింది. గురువారం సిరిసిల్లను సందర్శించిన మున్సిపల్ పరిశ్రమల శాఖల మం త్రి కేటీఆర్ పంట నష్టంపై సర్వే చేసి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఆదేశించా రు. అమాత్యుడి ఆదేశాలతో అధికార యం త్రాంగం చేలకు పరుగులు పెట్టింది. వరద పాలైన పంట నష్టంపై సర్వే ప్రారంభించింది. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారి రణధీర్రెడ్డి, 57 మంది ఏఈవోల బృందం ప్రతిపల్లె తిరుగుతూ సర్వే చేస్తున్నది. 4,822 మంది రైతులకు సంబంధించిన 6,710వేల ఎకరాల పంటనష్టం వాటిల్లినట్లు రెండు రోజుల్లో చేపట్టిన సర్వే ఇది. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి సర్కారుకు నివేదికలు పంపేందుకు కసరత్తు చేస్తున్నది. 1643 మంది రైతులకు చెందిన పత్తి 2430 ఎకరాలు, 3179 మంది రైతులకు చెందిన వరి 4280 ఎకరాలు నష్టం జరిగింది.
మధ్యమానేరు నీటితో భూగర్భ జలాలు పెరిగి ఆనందం నింపగా, భారీ వర్షాలు విషాదాన్ని తెచ్చిపెట్టాయి. మధ్యమానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వచ్చిన కాళేశ్వర జలాలతో మండుటెండల్లో ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంలు మత్తుళ్లు దుంకాయి. యాసంగిలో అంచనాలను తారుమారు చేస్తూ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధాన్యం 400మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. అన్నదాతల ఇండ్లు, సర్కారు కట్టించిన గో దాములు ధాన్యపు రాసులతో నిండిపోయా యి. అదే స్ఫూర్తితో వానాకాలంపై ఆశలు పెట్టుకుని రెట్టింపు ఉత్సాహంతో రైతులు సాగు చేసిన పంటలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మూడు రోజుల పాటు ఏకధాటిగా భారీ వర్షాలతో ఆపార నష్టం కలిగించింది. సిరిసిల్లను జల దిగ్బంధనం చేసిన వరద నీరు పంటలను సైతం ముంచేసింది. వానకాలం పంటపై పెట్టుకున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. వందల ఎకరాల పంట వర్షార్పణం అయింది.
చేలకు తరలిన సర్వే బృందాలు …
కురిసిన భారీ వర్షాలపై మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పంధించారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న సిరిసిల్ల ప్రజలను రక్షించేందుకు యుద్ద ప్రతిపాదికన హైదరాబాద్ నుంచి 50 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిరిసిల్లకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న సిరిసిల్ల పట్టణ ప్రజలను దాదాపు 250 మందిని రక్షించగలిగారు. మంత్రి స్పందించి సకాలంలో రెస్క్యూ బృందాలను పంపడం వల్ల వందల మంది ప్రాణాలు కాపాడి, భారీ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన మంత్రి హుటాహుటిన సిరిసిల్లకు చేరుకున్నారు. కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో సమీక్షించారు. భవిష్యత్తులో వరదలు వచ్చినా ప్రజలకు, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి తనకు నివేదికలు సమర్పించాలని సూచించారు. అలాగే జరిగిన పంట నష్టంపై సర్వే చేసి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆదేశించారు. రామన్న ఆదేశాలతో కదిలిన యంత్రాంగం వినాయక చవితి పండగ సెలవును రద్దు చేసుకుని సర్వే ప్రారంభించింది.
మనసున్న రామన్న …
వరద, కలిగించిన నష్టంపై రామన్న మన సు చలించింది. ఇండ్లలోకి వచ్చిన నీరు, తన జిల్లా ప్రజలు పడ్డ ఇబ్బందులను స్వయంగా చూశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ మోకాలు లోతు నీటిలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలు విన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా జిల్లా ప్ర జలకు ఇబ్బందులు, ఆస్తి నష్టం జరుగకుం డా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు ఎంత ఖర్చయినా సరే ప్రణాళికలు రూపొందించి వెంటనే నివేదికలు పంపించాలని ప్రజల ముందే అధికారులను ఆదేశించారు. అమాత్యుడి ఆదేశాలతో ఒక పంట చేలకే కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అధికార యంత్రాగం పర్యటిస్తూ పంటలు, ఆస్తి నష్టంపై సర్వే చేపట్టింది.
6,710 ఎకరాల పంట వరద పాలు
జిల్లాలోని పదమూడు మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారుల బృందం సర్వే ప్రారంభించింది. వినాయక చవితి పండుగ రోజు కూడ సెలవు రద్దు చేసుకుని మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సర్వేలో 58 మంది బృందం విస్తృతంగా పర్యటిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా వరదలతో నష్టపోయిన పంటల నష్టాన్ని ఇప్పటి వరకు జరిపిన సర్వే ప్రకారం వివరాలు సేకరించింది. మరో నాలుగు రోజుల్లో పూర్తి స్తాయిలో వివరాలు సేకరించి పరిహారం కోసం నివేదికలు సర్కారుకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 4,822 మంది రైతులకు సంబంధించి 6,710 ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ శాతం వేములవాడ రూరల్ మండలంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వ రకు చేపట్టిన సర్వే ఆధారంగా 1643 మంది రైతులకు చెందిన పత్తి 2430 ఎకరాలు, 3179 మంది రైతులకు చెందిన వరి 4280 ఎకరాలు నష్టం జరిగినట్లు తెలిపారు.