ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం డిస్కౌంట్
10వేల లోపు వారికి మాత్రమే వర్తింపు
ఈ నెల 31వరకు చివరి అవకాశం
లక్ష్యం దిశగా అడుగులు..
వేములవాడ, మే11: ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించే వారికి మున్సిపల్ శాఖ 50శాతం డిస్కౌంట్తో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. 10వేల లోపు ఆస్తి పన్నును ఈ నెల 31లోగా చెల్లించేస్తేనే ఈ రాయితీని కల్పించింది. పట్టణ ప్రజానీయం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తున్నది.
డిస్కౌంట్ ఆఫర్
మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లించే యజమానులకు బల్దియా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. గతేడాది ముందస్తుగా 5శాతం డిస్కౌంట్తో పన్నులు చెల్లించిన యజమానులకు ఇప్పుడు 50తోపాటు అదనంగా ఐదు శాతం మొత్తంగా 55శాతం రాయితీ వర్తిస్తుందని మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. డిస్కౌంట్ను మున్సిపల్ శాఖ మే 31వరకు పొడిగించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 10వేల లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
50.38 లక్షల వసూళ్లు..
మున్సిపల్ పరిధిలో 1.85కోట్ల ఆస్తి పన్నుల డిమాండ్ ఉంది. ఇంకా డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడం తో ఇప్పటి వరకు ప్రజలు 50.38లక్షల పన్నులు చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 27.17శాతం ఆస్తి పన్నులు వసూలు కాగా, దాదాపుగా ప్రతిరోజూ లక్ష వరకు డిస్కౌంట్ పద్ధతిన ఆస్తి పన్నును చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది 2020-21వ ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం డిస్కౌంట్తో 74లక్షల పన్నులు చెల్లింపు కాగా, ఇప్పుడు 50శాతం డిస్కౌంట్లోనే 50లక్షల వరకు పన్నులు చెల్లించారు.
వినియోగించుకోవాలి
ఆస్తి పన్నులను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే చెల్లించే వారికి రాయితీ ఇస్తున్నాం. 10వేల లోపు నివాసాలకు సంబంధించిన ఆస్తి పన్నులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. ప్రజలు డిస్కౌంట్ ఆఫర్ను సద్వినియోగం చేసుకొని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి. కార్యాలయం, బిల్ కలెక్టర్కు ద్వారా అయినా పన్నులు చెల్లించవచ్చు.