సరదాకు పోయి..అలవాటుగా మారి..
గంజాయి మత్తులోయువతరం..
డీ-అడిక్షన్ కేంద్రంలోకౌన్సెలింగ్తో మార్పు
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ);రెండు నెలలుగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మత్తును సేవించే వారిని మార్చేందుకు ‘నయా సవేరా’ పేరుతో డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమృత ఫౌండేషన్సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ దేవికారాణీ, డాక్టర్ హజిరా తస్నీమ్ సహకారాన్ని తీసుకుంటున్నారు.ఈ కౌన్సెలింగ్ను రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.ఈ కౌన్సెలింగ్లో గంజాయి అలవాటు అయిన బాధితులు
చెబుతున్న కారణాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
2 నెలలు..60 మంది..
రెండు నెలల నుంచి ప్రతి మంగళవారం ఎల్బీనగర్లోని రాచకొండ పోలీసు క్యాంపు కార్యాలయంలో మత్తుబాబులకు డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నారు. ఎన్డీపీఎస్ కేసులలో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటికి వచ్చిన వారిని ఈ కౌన్సెలింగ్కు పిలుస్తున్నారు. ఈ రెండు నెలలో దాదాపు 60 మందికి డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ను ఇచ్చారు. ఇందులో 22 నుంచి 30 సంవత్సరాల వారే అధికంగా ఉన్నారు. ఇందులో ఉన్నత విద్యాభ్యాసం అర్హత ఉన్నవారే ఉండడం ఆవేదనకు గురిచేస్తుంది.
తల్లిదండ్రులు గుర్తించాలి
మేము కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. చాలా మందికి ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి తెలియదు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను గుర్తించాలి. గంజాయి, డ్రగ్స్ సేవించిన వారు తమ రోజు వారి పనుల్లో మందగిస్తారు. సరిగా భోజనం చేయరు. డ్రెస్సింగ్ సరిగా వేసుకోరు. అందరితో కలవరు. మత్తుతో అధికంగా నిద్రపోతారు. వీటన్నింటిని ఇంట్లో వారు గుర్తు పట్టాలి. వెంటనే వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలి.-దేవిక, అమృత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
14 గంటలు వృథా..
ఈ గంజాయిని తాగేందుకు చాలా మంది యువత తమ విలువైన సమయం 3 నుంచి 4 గంటలు వృథా చేసుకుంటున్నారు. ఇది కేవలం సేవించడానికి అయితే ఆ తర్వాత మత్తులో వారు నిద్రపోయి, ఆ తర్వాత ఆ మత్తు ప్రభావంతో మరుసటి రోజు తెలవారు నిద్ర లేవకుండా బద్ధకంగా మారిపోవడం, ఎలాంటి పనులు చేయకుండా ఉండిపోవడం వంటి సమయాన్ని విశ్లేషించుకుంటే కనీసం గంజాయి సేవించిన తర్వాత దాదాపు 14 గంటల పాటు సమయాన్ని నిరుపయోగంగా మార్చుకుంటున్నారని తేలింది. అది కూడా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు గడిపి చదువును పక్కనే పెడుతున్నట్లు తేలింది.
చట్టం చాలా కఠినం
గంజాయి, డ్రగ్స్లను సేవిస్తూ పట్టుబడే వారిపై చట్టపరంగా చాలా కఠిన శిక్షలు ఉన్నాయి. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై చట్టపరంగా ఎన్ని శిక్షలు ఉంటాయో గంజాయి, డ్రగ్స్ను సేవించే వారిపై కూడా అదే తీరు శిక్షలు ఉంటాయి. పట్టుబడి శిక్షలు పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లడానికి అనుమతులు రావు. దృఢనిశ్చయంతో మారుతామని ముందుకు వచ్చే వారికి ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 64-ఏ కింద దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చి వారికి మారడానికి అవకాశం ఇస్తున్నాం.
భారతీయతకు మారుపేరు
భారతీయతకు మారుపేరుగా నిలిచిన వివేకానందుడు ఎంతో మందికి ఆదర్శం. 1883లో చికాగోకు వెళ్లి తన ప్రసంగంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబింపజేసిన ఘనత ఆయనది. ప్రపంచవ్యాప్తంగా తన ఉపన్యాసాల ద్వారా ప్రభావితం చేశారు. యువతకే కాదు భారతీయులందరికీ ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని నేర్పితేనే నవభారతాన్ని నిర్మించగలుగుతాం.-జి.రాములు, ఉపాధ్యాయుడు