చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్
శంకర్పల్లి, జనవరి 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని 70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ప్రతి పక్షాలు సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించడం సరికాదన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ చేకుర్త గోవిందమ్మ, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో వెంకన్న, ఎంఆర్ఐ విక్రంరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
పేదల ఆరోగ్య భద్రతకు భరోసా;ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్నగర్టౌన్, జనవరి 11 : ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి కొండంత భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామానికి చెందిన ఇస్నాతి శ్రీనివాస్కి రూ. 60 వేలు, శంకరయ్యకి రూ. 60 వేలు, లింగంకు రూ. 23 వేలు, కిషన్నగర్ గ్రామానికి చెందిన విజయకి రూ. 60 వేలు, హరిశంకర్కి రూ. 60 వేలు, చింతగూడ గ్రామానికి శేఖర్కి రూ. 42 వేలు, బూర్గుల గ్రామానికి చెందిన రాజుకి రూ. 30 వేల సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల అభ్యన్నతికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం పట్ల లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు, ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ ఎంఎస్ నటరాజ్, సర్పం చ్ శ్రీశైలం, నాయకుడు మశ్చేందర్, రవి పాల్గొన్నారు.