స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్లను ఆదర్శంగా తీసుకోవాలి
రాష్ట్ర అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
135 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ
నిర్మల్ అర్బన్, జూన్ 10 : స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులు, అర్చకులకు మున్సిపల్ కార్యాలయంలో కడారి నరేశ్, వైద్యుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురికి సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అర్చకులు, ప్రైవేట్ ఉపాధ్యాయులకు స్ఫూర్తి ఫౌండేషన్, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ అండగా నిలువడం అభినందనీయమని అన్నారు. కడారి నరేశ్ రూ.2.75 లక్షలతో 135 మందికి నిత్యావసర సరుకులు అం దించారని, ప్రతి ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని సేవాభావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
థర్డ్ వేవ్ వస్తుందని టీవీలు, పేపర్లలో వార్తలు వస్తున్నాయని, దానిని ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానలోనే 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. రోగులు ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. అనంతరం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కడారి నరేశ్, డాక్టర్ ప్రవీణ్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, వైస్ చైర్మన్ సాజిద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, ఎడిపెల్లి నరేంధర్, పూదరి రాజేశ్వర్, లక్కాకుల నరహరి, నాయకులు అడ్ప పోశెట్టి, శ్రీధర్, నర్సాగౌడ్, ఫౌండేషన్ సభ్యులు శ్రీవ్యాల్, తదితరులు పాల్గొన్నారు.