ఇద్దరు పిల్లలతో కలిసి మున్నేరులో దూకి వివాహిత ఆత్మహత్య
అప్పుల బాధలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం
ఖమ్మం, జూన్ 9:వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కడదాకా కలిసే జీవించాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహ జీవితాన్ని అన్యోన్యంగా సాగిస్తున్నారు. చెరో పని చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇద్దరు పిల్లలే లోకంగా బతుకుతున్నారు. భవిష్యత్పై ఎన్నో కలలు కన్నారు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు అప్పులయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.. చివరికి భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి మున్నేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం ఖమ్మం నగరంలో జరిగింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి జీవిద్దామనుకున్నారు.. వివాహ బంధానికి బాటలు వేసుకున్నారు.. ఇద్దరు పిల్లల్ని కని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చెరో పని చేసుకుంటూ కుటుంబాన్ని వెల్లదీసుకుంటున్నారు.. ఈలోపు కుటుంబ అవసరాలకు అప్పులయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా చుట్టుముట్టాయి.. దీంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. చివరికి భార్య ఏమనుకుందో ఏమో తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని మున్నేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. తనతో పాటు పిల్లల ప్రాణాలనూ బలిపెట్టింది.. మృతదేహాలను చూసి ‘అయ్యో దేవుడా.. నాకు అందరినీ దూరం చేశావా.. నన్ను ఒంటరిని చేశావా..’ అంటూ భర్త కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం ఖమ్మం నగరంలో జరిగింది.
ఖమ్మంనగరంలోని మున్నేరులో బుధవారం ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి మున్నేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రేవతి సెంటర్కు చెందిన దోణ్వాన్ రవి 12 ఏళ్ల క్రితం ఖానాపురానికి చెందిన వనిత (30)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి చైతన్య(10), రోహిత(8) పిల్లలు. రవి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా వనిత ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నది. ఈక్రమంలో రవికి గతనెలలో కరోనా పాజిటివ్ రావడంతో భార్యతో పాటు పిల్లలను అత్తమామల ఇంటికి పంపాడు. రవికి నెగెటివ్ వచ్చిన తర్వాత భార్యా పిల్లలను ఇంటికి రమ్మని అత్తమామల ఇంటికి వెళ్లి కోరాడు. అందుకు భార్య నిరాకరించింది. దీనికి తోడు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మరోవైపు అప్పుల బాధలు వారిని కుంగదీశాయి. అప్పులు ఇచ్చిన వారు ఇటీవల వనితపై ఒత్తిడి తెస్తుండడంతో ఆమె మనస్తాపానికి గురైంది. బుధవారం ఆమె కుమార్తె రోహిత, కుమారుడు చైతన్యతో కలిసి నగరంలో కాల్వొడ్డులో ఉన్న మున్నేరు వద్దకు వచ్చి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ శ్రీధర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వచ్చారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు. వనిత తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు తీట్రౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.