టీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు
ప్రభుత్వ పనితీరును చూసి ఆకర్షితులవుతున్న సకలజనం
రోజురోజుకూ పలుచబడుతున్న కాషాయం
హుజూరాబాద్/ జమ్మికుంట/ హుజూరాబాద్రూరల్, అక్టోబర్ 5:టీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంటే.. బీజేపీ ధరల భారం మోపుతుంది. పెట్రోల్, డీజీల్, గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచింది. మరోవైపు సబ్సిడీల్లో కోతలు పెడుతుంది. ఆ పార్టీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. మనకు చేసిందేమీ లేదు. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి గట్టి వాత పెట్టాలి. గెల్లు శ్రీనును గెలిపించాలి’ అని మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. నల్ల ధనం బయటికి తీసి ప్రతి పేదోడి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి నోట్ల రద్దు చేసిన బీజేపీ.. మాట తప్పిందని, డబ్బుల మాట పక్కనబెడితే నల్లధనం ఒక్క రూపాయి వెనక్కు తేలేదని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, కుదవపెడుతూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నదని దుయ్యబట్టారు. మంగళవారం ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన 150 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు హుజూరాబాద్ మండలం సింగాపూర్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో చేరారు. యువ నేత అశోక్యాదవ్ ఆధ్వర్యంలో యాదవులు, ముస్లింలు పార్టీలోకి వచ్చారు. అనంతరం సింగాపూర్కు చెందిన 150మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే పోటీలో ఉంటాయని చెప్పారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ యూత్ నాయకుడు వొడితల ప్రణవ్బాబు, నాయకులు మాణిక్యరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఎల్లయ్య, సోమారపు రాజయ్య, సమ్మిరెడ్డి, కుమార్ పీఏసీఎస్ చైర్మన్ సుగుణాకర్రెడ్డి, పాల్గొన్నారు.
గెల్లుకు జైకొట్టిన రాంపూర్ రెడ్లు
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతు పెరుగుతున్నది. సకలజనం జై కొడుతున్నది. మంగళవారం హుజూరాబాద్ మండలం రాంపూర్కు చెందిన రెడ్డి కులస్తులు సింగాపూర్ గెస్ట్హౌస్లో మంత్రి హరీశ్రావును కలిసి టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కారు కృషితోనే ఇవ్వాళ మా రైతులంతా సంతోషంగా ఉన్నారని, తమకెంతో మేలు జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇక్కడ నాయకులు ఏనుగు మహిపాల్రెడ్డి, సురకంటి రాజిరెడ్డి, కాశిరెడ్డి అంజిరెడ్డి, కాశిరెడ్డి రవీందర్రెడ్డి, కాశిరెడ్డి శంకర్రెడ్డి, కాశిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏనుగు రాజిరెడ్డి, సురకంటి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గెల్లు గెలుపు ఖాయం: మంత్రి గంగుల
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, భారీ మెజార్టీ కోసం అందరు కలిసికట్టుగా పని చేయాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్లో బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్ చేరుతున్నారని చెప్పారు. కాగా అంతకుముందు సింగాపూర్ గెస్ట్హౌస్లో మంత్రి గంగుల సమక్షంలో హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్నర్సింగాపూర్కు చెందిన 150మంది యువకులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరగా, ఈ కార్యక్రమంలో నాయకుడు వొడితల ఇంద్రనీల్ ఉన్నారు.
బీజేపీకి షాక్.. టీఆర్ఎస్లోకి ‘గనిశెట్టి’..
బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్ మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి గంగుల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్వర్తో పాటు గనిశెట్టి సదాశివ్, భరత్, బొనగాని సంపత్ పార్టీలోకి వచ్చారు. కాగా, రెండు నెలల క్రితమే ఆ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరగా, తాజాగా ఉమామహేశ్వర్ రాకతో ఈటల శిబిరంలో గుబులు మొదలైంది. ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్, నాయకులు గందె శ్రీనివాస్, గూడూరి ప్రభాకర్రెడ్డి, ఆకుల మొగిలయ్య, రావుల సురేందర్, రాంపెల్లి భిక్షపతి ఉన్నారు.
టీఆర్ఎస్లోకి ఆటో యూనియన్ నాయకులు
ప్రభుత్వ పథకాలను చూసి టీఆర్ఎస్లో ఆటో యూనియన్ నాయకులు చేరారు. మంగళవారం ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన ఆటో యూనియన్ నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం తామంతా కలిసి పని చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. సర్పంచ్ రఫీఖాన్, ఎంపీటీసీ చిన్నరాయుడు, మాజీ సర్పంచ్ బుర్ర రమేశ్, ఆటో యూనియన్ నాయకులు మహేశ్, మోహన్, రాజు, రజాక్, సర్ధార్, నరేష్, తిరుపతి, కేదారి, కార్తీక్, రాజేందర్, కుమార్, పున్నం, సతీశ్, రాజశేఖర్, సురేష్ ఉన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో బీజేపీని వీడి టీఆర్ఎస్లోకి చేరగా, కండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట కంటే ఎక్కువగా రాష్ట్రంలో రూ.1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చేరిన వారిలో మార్త రాజేశ్, బండారి సందీప్, ఎలుబాక నరేష్, గంధం నిశంత్, సాగర్, శివప్రసాద్, శనిగరపు గోపి, మోరె సంతోష్, మరో 40 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, నాయకులు మేకల శ్రీనివాస్రెడ్డి, దూలం సమ్మయ్య, కర్ర దేవరాజ్, గుమ్మడి సంపత్, శంకర్రెడ్డి, బిక్షపతి, కొమరరెడ్డి, బాలస్వామి, దూలం వెంకటేశ్, చిన్నాల అయిలయ్య ఉన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో కౌన్సిలర్ రాజయ్య ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, యూత్, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, జమ్మికుంట అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు. కారు గుర్తుకే ఓటేసి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. అలాగే, 13వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎండీ సలీమ్, రాజు, భిక్షపతి, రాజయ్య, సారయ్య, సమ్మయ్య, శ్రీరాం, ఫిరోజ్, తాజ్, రమేశ్, హరిప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ దయ్యాల శ్రీను స్థానిక నాయకులు, యువతతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.