ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
రూ.29 లక్షలతో ఐదు ఆటో ట్రాలీలు
90 వేలతో ఫాగింగ్ మిషన్ కొనుగోలు
సుల్తానాబాద్, జూన్ 2 : శుభ్రత విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో చెత్త సేకరణకు పట్టణ ప్రగతి నిధులు రూ.29 లక్షలతో 5 ఆటో ట్రాలీలు, దోమల నివారణకు రూ.90 వేలతో ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేశారు. వీటిని బుధవారం ఎమ్మె ల్యే, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత ప్రారంభించారు. ఈ సందర్భం గా మనోహర్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత నూతన మున్సిపాలిటీలకు ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తున్నదని తెలిపారు. పట్టణ అవసరాలకు ఐదు ఆటోల రాకతో ఇబ్బంది తీరుతుందన్నారు. చెత్త సేకరణపై కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ, జీపీ నుంచి బల్ది యాగా మారిన సుల్తానాబాద్లో మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. ఇక్కడ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్రావు, నాయకులు ముత్యం రమేశ్, బిరుదు కృష్ణ, పురం ప్రేమ్చందర్రావు, పారుపెల్లి జ్ఞానేశ్వరిగుణపతి, కూకట్ల గోపి, గుర్రాల శ్రీనివాస్, దున్నపోతుల రాజయ్య, సాజిద్, పసెడ్ల మమతసంపత్, చింతల రాజు, రఫీక్, అంజయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.