సబ్సిడీ వాహనం అందజేసిన
చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
హన్మకొండ, జులై 1 : బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బెస్ట్ స్కీం ద్వారా నగరానికి చెందిన నిరుపేద బ్రాహ్మణుడు మోత్కూరి సాయి శ్రవణ్కు సబ్సిడీపై మంజూరైన స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని గురువారం హైదరాబాద్లో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ సురభివాణీదేవి అందజేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బెస్ట్ స్కీం పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలుస్తున్నదన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ సురభివాణీదేవి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందిస్తున్న విప్ర ఫౌండేషన్ చైర్మన్, నిర్వాహకుడు పల్లూరి పవన్కుమార్ను చీఫ్విప్, ఎమ్మెల్సీ అభినందించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మోత్కూరి సాయిశ్రవణ్, మారం రాజశేఖర్, విన్నకోట రాజ్కుమార్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
లైంగికదాడికి గురై మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం ఆయన కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతుతో కలిసి కలెక్టర్ చాంబర్లో జిల్లాలో వేర్వేరు ఘటనల్లో లైంగికదాడికి గురై మృతిచెందిన నలుగురి కుటుంబ సభ్యులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ.. మునిగల హరిత, మానస, వెన్నెల, మరో యువతి వేర్వేరు సంఘటనల్లో మృతిచెందారని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. మునిగల హరిత సోదరి ప్రసన్న రేఖ, మానస సోదరుడు శ్రీనివాస్యాదవ్, వెన్నెల తండ్రి అజయ్, మరో యువతి సోదరి అనితకు కాకతీయ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో శానిటేషన్ సిబ్బందిగా ఎస్ఆర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ద్వారా నియామక పత్రాలు అందజేశారు.