వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తాం
ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటాలి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
హన్వాడ, పాలకొండలో పర్యటన
మహబూబ్నగర్టౌన్, జూలై 1: పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎక్రైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ 9వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి హరితహారంలో భాగంగా రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం వార్డులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ వార్డులో ఎక్కడా చెత్త ఉండొద్దని, దోమల నివారణకు చర్యలు చేట్టాలని, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటాలని కోరారు. గతంలో పాలకొండ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. వార్డులో పింఛన్లు రాని వారికి రెండు నెలల తర్వాత ఇస్తామని తెలిపారు. రూ.14లక్షలతో పాలకొండ చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామంలో మురికికాల్వల సమస్య రేపటిలోగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదేవిధంగా రహదారికి అవతలివైపున 15 ఇండ్లకు తాగునీరు లేదని తెలుసుకున్న మంత్రి రాత్రిలోగా తాగునీరు అందించాలని ఆదేశించారు. శ్మశానవాటిక నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు మాట్లాడుతూ పట్టణ ప్రగతి వచ్చిన తర్వాత శుభ్రత పెరిగి ప్రజలు రోగాల బారిన పడడం తగ్గిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, కౌన్సిలర్ నరేందర్, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీరామమూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, వార్డు కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, పీఏసీసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ నరేందర్రెడ్డి, మున్సిపల్ డీఈ వెంకన్న, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను శుభ్రంగా తీర్చిదిద్దాలి
హన్వాడ జూలై 1: కృష్ణానదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ నుంచి కుడి కాల్వ నిర్మాణం పనులను అడ్డుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాటానికి సిద్ధంగా ఉంటామన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా హన్వాడలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు పాల్గొని పర్యటించారు. రూ.15లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనం, బుద్దారంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనం, కారంతండాలో రూ.కోటి 40లక్షలతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాలను హరితవనంగా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హన్వాడలో మహిళలకు ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎంపీపీ బాల్రాజ్, జెడ్పీటీసీ విజయనిర్మిల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచులు రేవతి, చెన్నయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకట య్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు రాజుయాదవ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏవో కిరణ్కుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఏఈ యాద య్య, ఎక్సైజ్ ఎస్సై మనోహర్, నాయకులు లక్ష్మయ్య, జంబులయ్య, రమణారెడ్డి, బసిరెడ్డి, సత్యం, నరేందర్, ఆంజనేయులు, మోహన్, సుధాకర్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.