రెబ్బెన, జూన్ 1 : ఉన్నత విద్యలో విద్యార్థులను ప్రోత్సహించేందుకే సింగరేణి యాజమాన్యం మెరిట్ స్కాలర్షిప్ అందిస్తున్నదని బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి అన్నారు. ఏరియా వర్క్షాప్లో ఫిట్టర్గా వి ధులు నిర్వహిస్తున్న కొండు అశోక్ కూతురు రసజ్ఞ కరీంనగర్లోని చల్మె డ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. దీంతో జీఎం కార్యాలయ ఆవరణలో ఆమెకు రూ. 10 వేల స్కాలర్షిప్ను మంగళవారం అందించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, పీఎం లక్ష్మణ్రావు, డీవైపీఎం తిరుపతి, పలువురు ఉన్నారు.
80 శాతం బొగ్గు ఉత్పత్తి..
బెల్లంపల్లి ఏరియా గనులు మే నెలలో 3,10,000 లక్షల టన్నులకు గాను 2,49,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి (80 శాతం) సాధించినట్లు జీఎం సంజీవరెడ్డి తెలిపారు. ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. కైర్గూడ ఓసీపీ 3 లక్షల టన్నులకు 2,39,000 టన్నులు, బీపీఏఓసీపీటూ 10 వేల టన్నులకు వంద శాతం ఉత్తత్తి సాధించినట్లు తెలిపారు. 2,50,000 టన్నుల బొగ్గును రవాణా చేశామని చెప్పారు.