ఆధునిక అండర్గ్రౌండ్ వ్యవస్థ రూపకల్పన
రూ.500కోట్లతోప్రతిపాదనలు చేయాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, జూలై31: మహబూబ్నగర్ పట్టణం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతిపాదిత మాస్టర్ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణం రూపురేఖలు మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుదామని అధికారులకు తెలిపారు. రూ.500 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్ పిలువాలని మంత్రి ఆదేశించారు. అందులో భాగంగా 5 ఎస్టీపీల ద్వారా మురుగునీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని పెద్ద చెరువును శుద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధ్దం చేయాలన్నారు.
పట్టణానికి అనుబంధంగా వస్తున్న ప్రతిపాదత రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుపై చర్చించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై క్షేత్ర స్థాయి పర్యటన చేసి తదుపరి నిర్ణయాలను నమోదు చేయాలని తెలిపారు. సమీక్షా సమావేశంలో డీటీసీపీ డైరెక్టర్ విద్యాధర్రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఈఈ విజయభాస్కర్రెడ్డి, కన్సల్టెంట్ సుభాన్, ఇంజినీర్లు ఉన్నారు.