రెండు నెలల్లో గణేశ ఈకో పెట్ కంపెనీ ప్రారంభం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, జనవరి 31 : మంత్రి కేటీఆర్ చొరవతోనే రాష్ర్టానికి పరిశ్రమలు వస్తున్నాయని, కాకతీయ మెగాటెక్స్టైల్ పా ర్కులో రెండు నెలల్లో గణేశ ఈకో పెట్ కంపెనీ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గీసుగొండ మండ లం శాయంపేట టెక్స్టైల్ పార్కులో టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి పర్యటించారు. పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇండిస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రశంసిస్తున్నాయన్నారు. 2022 చివరి కల్లా కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్ కంపెనీ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. మరో సంవత్సరంలో తెలంగాణ నుంచి సూరత్కు వలసెళ్లిన 500 కుటుంబాలు తిరిగి వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. పూర్తి స్థాయిలో కంపెనీలు ఏర్పాటైతే వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సంతోశ్, కంపెనీ ప్రతినిధులు కేఎస్ రెడ్డి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి, ఎలుకుర్తి సర్పంచ్ జైపాల్రెడ్డి, నాయకులు ముంతరాజయ్య, నరహరి పాల్గొన్నారు.