సోన్, మే 4: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన వడ్లు తీసుకురావాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోన్ మండల కేంద్రంతో పాటు పాక్పట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. తాలు, మట్టి లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని కోరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలన్నారు. కార్యక్రమంలో మంజులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, రైతులు, తదితరులున్నారు