కోల్బెల్ట్ వ్యాప్తంగా పటిష్ట నిఘాకు కసరత్తు
గోదావరిఖనిలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటుకు సన్నాహాలు
ఫోన్ కాల్, ఈ- మెయిల్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
సీఎండీ శ్రీధర్ కీలక నిర్ణయం
పెద్దపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. కార్మికులను అన్ఫిట్ చేయిస్తామని డబ్బులు దండుకునే అక్రమార్కుల భరతం పట్టేందుకు సీఎండీ శ్రీధర్ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడమే కాదు నిరుద్యోగులను మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరిఖని కేంద్రంగా స్పెషల్ విజిలెన్స్ విభాగం ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా ఫిర్యాదు చేసేందుకు 9491144104, 9491145027 నంబర్లతో పాటు vig@scclmines.com మెయిల్ను అందుబాటులోకి తేగా, అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.
బొగ్గు ఉత్పత్తి..ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న సింగరేణి సీఎండీ శ్రీధర్, సంస్థ పేరు చెప్పి కార్మికులు, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసగించే వారిపై ఉక్కుపాదం మో పాలని నిర్ణయించారు. సంస్థ అత్యంత పారదర్శకంగా కారుణ్య నియామకాలు, ఉద్యోగాల భర్తీ చేపడుతున్నా, కేటుగాళ్ల వసూళ్ల దం దాతో అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు.
రెచ్చిపోతున్న అక్రమార్కులు..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో కా రుణ్య నియామకాలు చేపడుతున్నారు. దీంతో పా టు ఇటీవల 5 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇదే అదనుగా కొందరు దందాకు తెరలేపారు. మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ డబ్బులు గుంజుతున్నారు. ఇంతటితో ఆగకుండా సింగరేణిలో ఉద్యోగానికి ఎంపికైనట్లు నిరుద్యోగులకు బోగస్ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ఘటనలూ వెలుగు చూశాయి. ఇలాంటి అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని యాజమాన్యం నిర్ణయించింది.
పకడ్బందీగా పరీక్షలు, మెడికల్ బోర్డులు..
వాస్తవానికి సింగరేణిలో ఉద్యోగాల భర్తీ కోసం నో టిఫికేషన్ వెలువడిన వెంటనే అత్యంత గోప్యంగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. తయా రు చేసిన నిపుణులను పరీక్ష పూర్తయ్యే వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేని చోట ఉంచుతారు. ఇక ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తే ట్యాంపరింగ్కు అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో పరీక్ష జరిగిన రోజే రాత్రి 9గంటల తర్వాత సింగరేణి వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇచ్చే పద్ధతి లేదు. అలాగే మెడికల్ ఆన్ఫిట్ను అత్యంత పారదర్శకంగా చేపడుతుంది. ఇలా సింగరేణి యా జమాన్యం పకడ్బందీగా చేపడుతున్న ఉద్యోగాల భర్తీ, అన్ఫిట్ ప్రక్రియపై అవగాహన లేని నిరుద్యోగులు వంచకుల వలలో పడుతున్నారు.