టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
హాలియా, మార్చి 22: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి సొంత గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలోని అనుముల గ్రామం, హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9వ వార్డులకు చెందిన 200 కుటుంబాల వారు కాంగ్రెస్ను వీడి సోమవారం రామగుండం ఎమ్మెల్యే, ఉప ఎన్నికల హాలియా మున్సిపాలిటీ ఇంచార్జి కోరుకంటి చందర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. వీరేగాక సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం పాల్తీ తండాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది యువకులు ప్రభుత్వ విప్, ఉప ఎన్నికల పెద్దవూర మండల ఇంచార్జి బాల్క సుమన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.