తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. కరోనా కారణంగా 2020, మార్చి 20న తిరుమలేశుని ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని నిలిపివేశారు. అయితే భక్తుల కోరిక మేరకు అదేఏడాది ఆగస్టు 7 నుంచి ఆర్జిత సేవలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కాగా, కరోనా ప్రభావం తగ్గడంతో ఈ నెల 1 నుంచి ఆలయంలో ప్రత్యక్షంగా భక్తులు ఆర్జిత సేవలు చేసుకునే సదుపాయాన్ని పునరుద్ధరించారు.