హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున టీటీడీ విడుదల చేయనుంది.