తిరుమల : వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవా టికెట్లను జూన్ వరకు ఆన్లైన్ విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు.
ప్రస్తుతం సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్టదళ పాదపద్మారాధన సేవకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్లో జూన్ 30 వరకు తిరుప్పావడ సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, లేదంటే రీఫండ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు భక్తులు విషయాన్ని గమనించాలని కోరింది.