తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు దివ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarshan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 63,831 మంది దర్శించుకోగా 25,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.36 కోట్లు వచ్చిందన్నారు.
పురుషామృగ వాహనంపై సోమస్కందమూర్తి విహారం
తిరుపతి కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామాక్షి సమేత సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై పురవీధుల్లో విహరించారు. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు.
,