కీసరగుట్ట : హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ( Keesaragutta ) ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ( Chairman BR Naidu ) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు , అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు. వేద పాఠశాల ప్రిన్సిపాల్ గూడ శ్రీనివాస శర్మ , అధ్యాపకులు, ఇంజనీరింగ్ అధికారులు, డీఈ , రామకృష్ణ, జేఈ చలమా నాయక్ , విద్యార్థులు పాల్గొన్నారు.