తిరుమల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమందిరానికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమంది రం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు.