TTD News | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. డిసెంబర్ మాసానికి చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25న సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ నెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయాల్సి ఉండగా.. సోమవారానికి వాయిదా వేసింది. అలాగే, తిరుమలలో వసతి గదుల కోటాను 27న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.