తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 62,085 మంది భక్తులు దర్శించుకోగా 21,335 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.78 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.