తిరుమల : జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు ఐదువేల చొప్పున టోకెన్లు విడుదల చేయనున్నది. మిగతా రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.