శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. అలాగే 301.5గ్రాముల బంగారం, ఆరున్నర కేజీల వెండి, 1,517 అమెరికా డాలర్లు, 25 ఇంగ్లండ్ పౌండ్స్, ఆస్ట్రేలియా డాలర్లు 50, కెనడా డాలర్లు 50, సింగాపూర్కు చెందిన నాలుగు డాలర్లను భక్తులు కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపును నిర్వహించినట్లు పేర్కొన్నారు. లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యుడు రెడ్డివారి, దేవస్థానం సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.