తిరుమల : మహా కుంభమేళా( Maha Kumbh Mela) సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీనివాస కల్యాణాన్ని (Srinivasa Kalyanam) అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ ఘట్టాలతో స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గంగా హారతి సమర్పణ
మహా కుంభ మేళా సందర్భంగాదశాశ్వమేధ ఘాట్లో అర్చకులు శుక్రవారం సాయంత్రం గంగా హారతి సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి శ్రీనివాస స్వామిని దశాశ్వమేధ ఘాట్ వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ తీసుకెళ్లి గంగా నదీ తీరంలో హారతి సమర్పించారు.