TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మాసం రోజుల పాటు జరిగే ఉత్సవ విశేషాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. డిసెంబర్ 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం జరుగనున్నది. అలాగే 8న సర్వ ఏకాదశి, 12న అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 17 నుంచి ధనుర్మాసం మొదలవనున్నది.
22న శ్రీవారి సన్నిధిలో చిన్నశాత్తమొర కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ దర్శనాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నది. అదే రోజు శ్రీవారి స్వర్ణ రథోత్సవ సేవను నిర్వహించనున్నట్లు తెలిపింది. 24న వైకుంఠ ద్వాదశి రోజున శ్రీవారి చక్రస్నానం, స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి, 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవాలు జరుగుతాయని టీటీడీ వివరించింది.