అగ్నిర్యథైకో భువనం ప్రవిష్ణో
రూపం రూపం ప్రతిరూపో బభూవ!
ఏకస్తథా సర్వభూతాంతరాత్మ
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ!
సృష్టి ఉద్భవించే సమయంలో విశ్వంలో మొదటగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం మొదలుపెట్టింది. సర్వప్రాణులకూ శక్తినిచ్చి ప్రపంచాన్ని చైతన్యపరిచింది.
అదే ఆత్మ లేదా పరమాత్మ. అది తానున్న శరీరం పడిపోగానే మరో శరీరంలోకి చొరబడుతుంది. భగవద్గీతలోనూ ఆత్మకు నాశనం లేదని శ్రీకృష్ణభగవానుడు పేర్కొన్నాడు. తనలో ఉన్న ఆత్మను గుర్తించినవాడే నిజమైన జ్ఞాని.