తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala) కు భక్తుల రాక తగ్గింది. మూడు రోజులుగా తిరుమల కొండపై భక్తుల తాకిడి పెరుగగా బుధవారం మాత్రం తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు (Devotees) స్వామివారిని దర్శించుకునేందుకు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(Ttd) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,021 మంది భక్తులు దర్శించుకోగా 19,091 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.15 వచ్చిందని వివరించారు.