తిరుమల : ఆపదమొక్కులవాడు..అనాథరక్షకుడు వేంకటేశ్వరస్వామి ( Venkateshwar Swamy ) ని ఇటీవల కాలంలో రానంతగా రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. విద్యా సంస్థలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల ( Tirumala ) కు చేరుకుంటున్నారు.
తిరుమలలో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం 90,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 52,236 మంది తలనీలాలు అర్పించుకున్నారు. మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.23 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. 4.35 లక్షల లడ్డూలను విక్రయించామని తెలిపారు.