తిరుమల : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు పాల్గుణ పౌర్ణమి కావడం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.