యాదాద్రి: ప్రముఖ ఆలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేదపండితులు హవనం, మూలమంత్ర జపాలు పఠిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. ఈనెల 19 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజలు, భక్తులు తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలు చెరిగిపోయేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా బాలాలయంలో సుదర్శన, నారసింహ హోమం, కల్యాణం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.