అమరావతి : విజయవాడలో కొలువుదీరిన ఇంద్రకీలాద్రి (Indrakiladri) కనకదుర్గ ఆలయాన్ని తెలంగాణ మంత్రులు (Telangana Ministers) దర్శించుకున్నారు. మంగళవారం ఇంద్రకీలాద్రి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మంత్రి శ్రీదర్బాబు(Sridar Babu) ను దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు మంత్రులకు వేదాశీర్వచనం అందజేశారు . ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు.
భట్టి విక్రమార్క మీడియాతో మాడ్లాడుతూ ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు . మంగళగిరిలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్ 75వ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్న విషయం తెలిసిందే.